మార్టిన్ లూథర్ – సంఘ సంస్కరణ ఉద్యమానికి దేవుని ఉపకరణం | Martin Luther Biography Telugu | Heroes Of Faith | Telugu Missionary Story | the German Reformation

Table of Contents
Martin Luther Biography Telugu
1.బాల్యం – ఏసెలెబెన్లో మార్టిన్ తొలి అడుగులు
లూథర్ గొప్ప సంఘ సంస్కరణోద్యమ కారుడా? అవును. సంఘ సంస్కరణ ఉద్యమమునకు ప్రాముఖ్యమైన పునాది వేయుటకు ప్రభువు ఆయనను వాడుకొనెను. లూథర్ తనను గూర్చి తాను ఎలా భావించెను? ఆయన మరణమునకు ఓ కాగితమందు “మేము నిశ్చయముగా భిక్షకులము” అను మాటలు కనబడెను.
భిక్షగానికి తనదంటూ ఏదీ ఉండదు, తన అవసరతలనిమిత్తమై ఆయన ఇతరులపై పూర్తిగా ఆధారపడును.
మార్టిన్ లూథర్కు తన అనుదిన జీవితములో ప్రభువు అవసరమాయెను. దేవుని సేవకుడు, సంఘసంస్కరణకర్త అలాగేయుండును…..!
మార్టిన్ క్రీ.శ. 1483 సం||లో జర్మన్నందలి ఏసెలెబెన్ అను అందమైన గ్రామములో జన్మించెను. ఆయన శిశువుగా ఉన్నపుడే మతగురువు ద్వారా లూథర్కు బాప్తిస్మమీయబడెను. శిశువులుగా నున్నపుడు చనిపోతే వారు పరలోకము వెళ్ళుదురు. ఆయన లోకములో ప్రవేశించినప్పుడు నీటి బాప్తిస్మము శిశువు పాపములను కడిగివేయును. దీనిని సంఘము బోధించును. ఇటువంటి సంఘ తప్పులద్వారా సామాన్యప్రజలు పెడత్రోవపెట్టబడుచున్నారు.
మార్టిన్ ఏడు సంవత్సరముల వయసుగలవాడైయున్నపుడు చదువుట వ్రాయుట నేర్చుకొనుటకు పాఠశాలకు వెళ్ళెను. త్వరలో ఆయన పది ఆజ్ఞలు, ప్రభువు నేర్పిన ప్రార్థన
మరియు అపొస్తలుల విశ్వాసపు ఒప్పుకోలును కంఠస్థముచేసెను.
సంఘ గాయక బృందములో ఆయన చేరెను. మార్టిన్కు చక్కటి స్వరముండి పాడుటకు చాలా ఇష్టపడేవాడు.
ఆయన పద్నాలుగేండ్ల వయసుగలవాడై యున్నపుడు మగ్డిబర్గ్ లోని పాఠశాలకు వెళ్ళి రోమన్ క్యాథలిక్ బోధలను నేర్చుకొనెను. ఆయన ఆక్కడ ఉంటుండగా పాఠశాలయందలి గ్రంథాలయములో ఓ బైబిల్ ఉంటే దానిని చదువుతూ చాలా సమయముగడిపెను. ఆయన చక్కగా చదివే విద్యార్థి గనుక ఏసెల్బెన్ లోని పాఠశాలకు వెళ్ళెను. ఒక సంవత్సరము పిమ్మట సార్వత్రిక విద్యాలయములో పైచదువులనిమిత్తమై వెళ్ళెను.
చూడండి! మార్టిన్ మరియు ఆయన స్నేహితులు వీధులగుండా పాడుచూ వెళ్ళు చున్నారు! ఎవరైనా తలుపు తెరచి వారి పాటలకై కొంత డబ్బిత్తురని ఆశించిరి. వాస్తవమునకు మార్టిన్ మరియు తన మిత్రులు వారి ఆహారమును వారే చూచుకొనవలెను… కొన్ని నెలల పిమ్మట మనము తరచుగా మార్టిన్ కాట్టాస్ ఇంట వద్దగాని లేదా షాల్బె ఇంటి వద్దగాని కనిపించేవాడు. వీరు సంగీత రసజ్ఞులు మరియు మార్టిన్ సంగీతమును ఆనందించేవాడు. ఆయన తంత్రిల వాయిద్యము వాయించేవాడు. రెండు సంవత్సరముల పిదప న్యాయశాస్త్రమును చదువుటకు ఉపయోగపడు ప్రవేశిక/సిద్ద పాటు కోర్స్ చదివెను. తరువాత ఆయన న్యాయాధిపతి లేక న్యాయవాది కావచ్చును. మార్టిన్ ఇది చేయవలెనని తన తండ్రి ఆశగలవాడై ఈవిషయమై ఓ కౌంట్తో మాట్లాడెను (కౌంట్=ఐరోపాలోని ఉన్నత వంశీయుడు). లూథర్ తండ్రి తనకుమారుని విషయమై గర్వపడెను.
2.ఆకాశంలో మెరుపులతో మారిన మార్గం
ఇతర నాలుగువందలమంది విద్యార్థులతో మార్టిన్ విశ్వవిద్యాలయమునందు తన కోర్ను ప్రారంభించెను. ఎర్ఫర్ట్లోని విశ్వవిద్యాలయము తన ఇంటనుండి దాదాపు నాలుగువందల కిలోమీటర్ల దూరములో ఉండెను, కనీసము మూడు దినముల నడక ప్రయాణము పట్టేంత దూరముండెను గనుక ఆయన ఎర్ఫర్ట్లో నుండుటకు వెళ్ళెను.
రోమన్ క్యాథలిక్ విశ్వాసమును గూర్చి తన లెక్చరర్స్తో మాట్లాడినప్పుడు బైబిల్ ఉన్నవాటికి భిన్నముగా వారు సమాధాపమివ్వటం లూథర్ గమనించెను. ఎర్ఫర్ట్నందునూ విశ్వవిద్యాలయములో బైబిల్ను చదువుటలో ఎక్కువసమయము గడిపెను. ప్రత్యేకముగా హన్నా మరియు సమూయేలు కథ ఆయనపై లోతైన ప్రభావమును కలిగించెను. మార్టిన్ లోతుగా ఆలోచించువాడు. ఆయన మరణమును గూర్చి చాలా ఆలోచించేవాడు.

నిశ్చయముగా పరలోకము వెళ్ళుటకై ఆయన చేయగలిగినన్ని మంచి క్రియలు చేయుటకు నిర్ణయించుకొనెను. ఇంటిలోనూ సంఘమందునూ ఆయనకు ఇలాగే నేర్పబడెను. నాలుగు సంవత్సరములు చదువు పిమ్మట మార్డిన్ చక్కటి మార్కులతో ఉత్తీర్ణుడాయెను. ఇప్పుడు ఆయన న్యాయవాద శాస్త్రం చదువుటకు వెళ్ళవచ్చును. మరొకసారి ఆయన తనతల్లిదండ్రులు నివసించు మాన్స్ఫెల్డ్స్నుండి ఎర్ఫర్కు ప్రయాణమాయెను. ఆకాశము నల్లబడెను, చీకటికమ్మెను. వచ్చే గాలివాన నుండి తప్పించుకొనుటకై తన గ్రామమునకు మార్టిన్ పరుగు పరుగునవచ్చెను. కాని సమయానికి చేరుకోలేక పోయెను. బలమైన గాలి, భయంకరమైన మెరుపులు, గాలివాన ఘోరముగా వస్తుందేమో అన్నంతగా… చాలా భయపడి, ముందుకు వెళ్ళెను గాని తన పాదముల దగ్గర భయంకరమైన మెరుపు వచ్చి అతనిని భూమిపై పడవేయబడెను.
“సెయింట్ ఆన్నీ సహాయము చేయుము నేను ఓ సన్యాసినవుతాను” అని మార్టిన్ భయముతో అరిచెను.
గాలివాన తగ్గెను. మార్టిన్ వణకుతూనే నుంచొని తన ప్రయాణమును మళ్ళీ కొనసాగించెను. ఇప్పుడు ఆన్నీతో చేసిన మ్రొక్కుబడి నెరవేర్చాలి. (రోమన్ క్యాథలిక్ సాంప్రదాయము ప్రకారము ఆన్నీ మరియ తల్లి). నిశ్చయముగా మార్టిన్ ఆన్నీకి చేసిన వాగ్దానమును దేవుడు వినెను. ఇప్పుడు ఆయన తన మ్రొక్కుబడి చెల్లించాలి.
లూథర్ తండ్రి తన కుమారుడు చేయ బోవు సంగతిని విని చాలా కోపపడెను. మార్టిన్ స్నేహితులు ఆయనను అలా చేయకుండా ఆపే ప్రయత్నము చేసిరి.
3.ఆశ్రమంలో లూథర్ – క్రీస్తు నీతి తో పరలోక కాంతి
జూలై మాసము వేసవికాలములో ఓ చక్కటి దినమున ఎర్ఫర్టు సమీపమున ఉన్న కఠిన అగస్టీనియన్ ఆశ్రమము పెద్ద తలుపు ఎవరో తట్టిన శబ్దం. మార్టిన్ ఆ భవనమునందు ప్రవేశించెను, ఆ తలుపులు నెమ్మదిగా తెరచు కొనెను… తన చిన్న గదిలో ఒక చిన్న కిటికి వుండెను దాని ద్వారా కాస్త వెలుతురు వచ్చుచుండెను. తన గదిలో ఒక టేబుల్, కుర్చీ మరియు పడుకొనుటకు ఒక చెక్క బెంచ్ ఉండెను. ఆశ్రమములో మొదటి పండ్రెండు మాసములు మార్టిన్కు చాలా కష్టముగానుండెను. తాను ఆశ్రమనిబంధనలకు అన్నివిషయములలో లోబడియుందునని ప్రతిజ్ఞ చేసెను. ఓ చక్కటి బైబిల్ కూడా ఆయనకివ్వబడెను. మార్టిన్ తప్పక బైబిల్ను క్షుణ్ణముగా చదువనైయున్నాడు… తాను ఏదో కష్టపడుతున్నాడని గాక, ఆశ్రమ నిబంధనలకు తట్టుకొలేక కాదు గాని బైబిల్ లోని సంగతులు చదువుతూ అసౌకర్యమునకు అశాంతికి గురియాయెను. ఆయన దేవునితో సమాధానపడే విధముగానుంటే ఆయన ఇంకా ఎంతైనా చేయుటకు సిద్ధముగానున్నాడు. అత్యున్నత అధికారముగల న్యాయాధిపతి… దేవునియెదుట ఆయన తప్పక అగుపించవలెను! మార్డిన్ ఎంతో పాపాత్ముడుగానున్నట్లు భావించెను!
కాని తన పావములన్నియూ అధిగమించుటకు ఆయన ప్రయత్నించనైయున్నాడు. ఆయన నిద్ర లేక, సెయింట్ను వేడుకొంటూ ఎక్కువసమయము ప్రార్థనలో గడిపెను. తరచుగా ఉపవాసముంటూ మూడురోజులు ఆహారము ఒకమెతుకైననూ ముట్టకయుండెను. చలికాలములో, కఠిక చలిలో దుప్పటి కూడా కప్పుకొనక రాత్రంతా ఆరుబయలులో పరుండేవాడు. మెలకువగా ఉండాలని రక్తము కారునంతగా తన శరీరమును బాదుకొనేవాడు. తరువాత పరిస్థితిని వివరిస్తూ “నేను చచ్చేంతగా నన్ను నేను హింసించుకొన్నాను” అని చెప్పెను.

ఒకానొక సందర్భములలో తన గదిలో మతి తప్పి పడిపోయెను. ఇతర సన్యాసులు ఆయనను గౌరవించిరి ఎందుకంటే మార్టిన్ కంటె పవిత్రులెవరు లేరనివారి భావన.
తరువాత తన జీవితములో తననుగూర్చి మార్టిన్ ఇలా చెప్పెను “తన స్వంత యోగ్యతల ఆధారముగా పరలోకము చేరిన సన్యాసులు ఎవరైన ఉంటే అది నేనే”.
ఓ సంవత్సరము పిమ్మట క్రీ.శ.1507సం||లో మతగురువుగా నియమింపబడెను. రోమన్ క్యాథలిక్ సంఘములో దేవుని సేవకుడాయెను. ఇప్పుడు ఆయన బలిపూజ జరుపుటకు అనుమతింపబడెను. మొదటి సారి జరుపుచుండగా ఆయన ఇంకనూ సమాధానపడని పరిశుద్ధ దేవుని యెదుట నిలువబడియున్నందున వణక సాగెను. విషయములు మార్టిన్కు మరింత కఠినమాయెను. దేవుని కృపను కోరునంతగా ప్రార్థనలో పోరాడెను గాని అది ఎక్కడనూ ఆయన కనుగొనలేక పోయెను. పాప ఒప్పుకోలు తన హృదయ శాంతిని అను గ్రహింపలేకపోయెను. తాను చేసిన శ్రేష్టమంచిక్రియలు కూడా పాపముచే కలుషితమైనవని ఆయన వాటిని గూర్చి బైబిల్లో చదివెను గనుక ఆ మంచి క్రియలు కూడా ఆయనకు సహాయపడకపోయెను.
అంతా సవ్యముగా చక్కగా సాగుతున్నదో లేదోయని తెలుసుకొనుటకై అగస్టీనియన్ ఆర్డర్ ఆశ్రమ అధికారి ఆశ్రమమును దర్శించుటకు వచ్చేవాడు. ఆయన పేరు వాన్ స్టాపిజ్. వాన్ స్టాపిజ్ మార్టిన్ లూథర్ను కలుసుకొనెను. లూథర్ తన పాపములను గూర్చి చెప్పెను. దేవుని ఎదుర్కొనుటకు ఎంత భయపడుతున్నాడో, దేవునితో సమాధానమునకై ఎలా అన్వేషిస్తున్నాడో అను ఈ రెండు సంగతులు ఆయనతో తెలివెను. పాపములకై శ్రమపడిన క్రీస్తును సూచిస్తూ వాన్ స్టాపిజ్ లూథర్ను ఆదరించే ప్రయత్నము చేసెను. అధిక సయమయు బైబిల్ చదువుటయందు గడుపుమని ఆయన సలహానిచ్చెను. లూథర్ చాలా ప్రోత్సహింపబడెను గాని ఆయన కోరిన సహాయము వాన్ స్టాపిజ్ కూడా ఇవ్వలేకపోయెను.
వాన్ స్టాపిజ్ విటన్బర్గ్ నగరములోని విశ్వవిద్యాలయమునకు స్థాపికుడు. ఆయన ప్రొఫెసర్ గా పనిచేయుచూ తనపనిలో సహాయము చేయు మరొకరి నిమిత్తమై ఆయన చూచుచుండెను. అప్పటికే పండితుడైన లూథర్ను గూర్చి ఆయన ఆలోచించెను.
క్రీ.శ.1512సం||లో విటన్ బర్గ్ విశ్వవిద్యాలయములో లూథర్ ప్రొఫెసర్ నియమితుడాయెను. విద్యార్థులకు ఉపన్యాసములిస్తూ సంఘమునందు బోధచేస్తూ ఆయన ఆశ్రమములో నివసింపసాగెను. ఆశ్రమములోని మేడగదిలో లూథర్ తన బైబిల్ చదువుతుండెను. ఆ అంశము పై తన విద్యార్థులకు ఉపన్యాసమిచ్చుచుండెను గనుక రోమీయులకు పౌలు వ్రాసిన పత్రికను అధ్యయనము చేయుచుండెను.
రోమా 1:17లో “నీతి” అను పదమును లూథర్ చదివెను. ఆయన ఆ పదమను చాలా సందర్భములలో గమనించెను. ఆయన దానిని ఓ ఘోరపదమనెను. ఆ పదము, తన పాపములన్నిటికై దేవుడు తనను తీవ్రముగా శిక్షించును. ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి అని అర్థమిచ్చెను గనుక లూథర్ ఆ పదమును ద్వేషించెనని తరువాత చెప్పును.
బహుశ “నీతి” యను ఆ పదమునకు మరొక అర్థమున్నదేమో! ఇక్కడ “నీతి” యను పదమునకు పౌలు భావమేమి? అకస్మాతుగా సత్యము లూథర్పై ప్రకాశించెను. దానికర్థము క్రీస్తు నీతి! ఆయన శ్రమ మరియు మరణము ద్వారా క్రీస్తు ఆ నీతిని సంపాదించెను. ఆ నీతినే ఆయన పాపులకిచ్చును. ఈ నీతి ద్వారానే వారి పాపములన్నిటికై వారు క్షమాపణను పొందుకొనవచ్చును! విశ్వాసము ద్వారా ఇప్పుడు క్రీస్తు నీతిని లూథర్ స్వీకరిపవచ్చును, ఓ బిక్షకుని వలె దానిని ఉచితముగా పొందుకొనెను. అదంతయూ పరలోకమునుండి తనహృదయములోనికి ఓ కాంతి కిరణము ప్రసరించినట్లుగా ఉండెను. “నీను తిరిగి జన్మించినట్లు, తెరువబడిన పరదైసులో ప్రవేశించినట్లు” భావించితినని తరువాత లూథర్ చెప్పెను.
ఎట్టకేలకు లూథర్ తన హృదయమందు శాంతి కలిగియున్నాడు, కేవలం క్రీస్తు ఆధిక్యత మరియు నీతి ద్వారానే ఆయన దేవునితో సమాధానము కలిగియున్నాడు. అది దేవుని కృపాఫలమే, కేవలం దేవుని కృపాఫలితమే!
4.లూథర్ 95 థీసిస్ – అంధకారాన్ని ఛేదించిన దేవుని వాక్య కాంతి
గంటలు మ్రోగుచుండగా ప్రజలు సమూహములుగా దేవాలయమునకు వెళ్ళచున్నారు. వెళ్ళగలిగిన వారందరు వెళు చున్నారు. “నేడే కొనండి” “రేపు ఆలస్యము కావచ్చును” అని వారు చెప్పుచున్నారు. సంఘములో బలిపీఠము ముందు ఓ ఎఱ్ఱని పెద్ద సిలువ ఉంచబడెను. దాని ప్రక్కనే డబ్బు సంచి….. టెజెల్ అను ఓ ప్రముఖుడైన సన్యాసి మాట్లాడుట ప్రారంభించెను. దేవుడు పాపులను ఎంత ఘోరముగా శిక్షిస్తాడు అను సంగతి ఆయన ప్రజలకు వివరించుచుండెను. “కాని ఇప్పుడైతే” పాపక్షమాపణ పత్రములు అమ్మబడుచున్నవి అవి మీ పాపమంతటికిని సరిపోవును. పోప్ ద్వారా మీ పాపములన్నియూ క్షమింపబడినవని వ్రాయబడిన ఓ కాగితమును మీరు పొందుకొందురు. పాపక్షమ పత్రములు పరలోకద్వారము తెరచును! నీవు భవిష్యత్లో జరిగింపబోవు పాపముల కొరకు కూడా పాపక్షమ పత్రమును కొనవచ్చును. మృతులైన మీబంధువుల నిమిత్తమై మారు పాపక్షమ పత్రములనుకొంటే వారు నరకమునుండి నేరుగా పరలోకము వెళ్ళవచ్చును” టెజెల్ దీనిని వ్యాపారబద్ధము చేసెను. విషయమంత ఏమిటంటే డబ్బు. రోమ్లో పోప్ ఓ మాహాదేవాలయమును కట్టదలచెను.

టెజెల్చే వేలకొలది ప్రజలు ఎలా మోసపుచ్చబడుతున్నారో వినెను. ప్రజలు ఆయనయొద్ద పాపములు ఒప్పుకుని వాటి విషయమై పశ్చాత్తాపపడుటకు ఎలా నిరాకరిస్తున్నారో వినెను. మేము టెజెల్ నొద్ద పాపక్షమ పత్రములను కొన్నాము మేము పశ్చాత్తాప పడనవసరములేదనిరి ప్రజలు. మేము మాపాపములను సురక్షితము నిరభ్యంతరముగా కొనసాగింపవచ్చును. వారు ఇక ఏమాత్రమును వారి పాపముల విషయమై విచారపడుట లేదు.
ఇట్టి వ్యవహారము విషయమై లూథర్ చాలా కలతనొందెను. అది అక్టోబర్ 31, క్రీ.శ. 1517. లూథర్ మరియు తన అసిస్టెంట్ విటెన్బర్గ్్నందలి కాజ్లో చర్వపు నడచుచున్నారు. ఓ పొడువైన కాగితపుచుట్ట, మేకులు సుత్తె తీసుకొనివారు వెళు చున్నారు. దేవాలయపు ద్వారముపై కొన్ని దెడ్డలు సుత్తెలో వేస్తే ఆ కాగితపుచుట్ట సురక్షితముగానుండును. ఆ వాక్యములను థీసిస్ అందురు. (పరిశోధనా వ్యాసము). అందులో పాపక్షమ పత్రపు అమ్మకము మరియు సంఘమందలి తప్పిదములు వ్రాయబడియుండెను. అందులోని పండితులతో చర్చింపనుద్దేశింపబడెను గనుక అవి లాటిన్లో వ్రాయబడెను. పండితులు దానిని చదువగలిగెదరు.
నిజముగా దీనినే లూథర్ చేయగోరెను. కాని ప్రభువైతే తన వాక్యము ద్వారా ప్రజలకు రక్షణమార్గము తెలుపగోరెను. విటన్బర్గ్ లూథర్ చేసినది ఇట్టి ప్రక్రియను ప్రారంభించెను. అందుకే అక్టోబర్ 31. క్రీ.శ.1517 సంఘ సంస్కరణోద్యమ “జన్మదినముగా” ఎంచబడెను.
విషయమును ముందుగా జాగ్రత్తగా పరిశీలించకుండానే లూథర్ వెళ్ళి థీసిస్ (పరిశోధనా వ్యాసమును) దిగగొట్టలేదు. “దేవుడు నాతో ఉండులాగున అన్నిటికంటే మొదట దేవుని ఎదుట నేను సాగిలపడితిని” అని తనను గూర్చి లూథర్ చెప్పెను. ఆ ద్వారమునొద్దకు అనేక విద్యార్థులువచ్చి థీసిస్ ను చదువనారంభించిరి. ముద్రణాలయమునకు తీసికొనిపోవుటకు వారు జర్మన్ భాషలోనికి అనువదించిరి, నకలు చేసిరి. (ముద్రణ అప్పటికే కనుగొనబడియుండెను). ముద్రణ ద్వారా వేలకొలది ప్రజలు లూథర్ థీసిస్ ను చదివిరి. మరియు ఖచ్చితముగా ఇదే జరిగెను. గ్రామములతో పట్టణములలో సర్వత్రా ప్రజలు తొంబైఐదు థీసిస్ ను చదువనైనా చదువుతున్నారు లేదా బిగ్గరగా ఒకరు చదువుతుంటే విననైనా వింటున్నారు. ఈ థీసిస్ ఇతర దేశములకునూ చేరెను. “దూతలు అంతటా వ్యాపించిరి” అన్నట్లుండెనని కొందరనిరి.
ఈ థీసిస్లో ఏమున్నది? అంశములో… “సత్యముపట్ల నిజమైన యథార్థమైన ప్రేమగలిగి దానిని మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో వెలుగులోనికి తెచ్చుచున్నాము.”
అందులోని కొన్ని వాక్యములు.
- డబ్బుపెట్టెలో నాణెము పడగానే నరకమునుండి పరలోకమునకు ఆత్మ ఎగిరిపోవుట కేవలము మానవ ఊహ.
- శిక్షనుండి తప్పించి రక్షణను దయచేయునని పోప్ జారీ చేసిన పాపక్షమ పత్రములను అమ్మువారు, దాని బోధించువారు పొరబడిరి.
- తన పాపములవిషయమై నిజముగా విచారపడు ప్రతి క్రైస్తవుని దోషము పోప్ పాపక్షమా పత్రము లేకయే తొలగింపబడును!
సంఘముయొక్క నిజ ధననిధి దేవునికృపా పరిశుద్ధ సువార్త. లూథర్ చిన్న పుస్తకములను మరియు కరపత్రములను వ్రాసెను. మనము వాటిని చదివినపుడు ప్రజలెలామోసపోయారో గ్రహింపవచ్చును. వారు చదివినపుడు మరియకు, ఆయా సెయింట్సు చేయు ప్రార్థనలు వట్టివే గ్రహింతురు. క్రీస్తు యోగ్యతల ద్వారానే పాపులు రక్షింపబడుదురు. సోల గ్రేషియా-కేవలము దేవుని కృప!
ఆకలిగొన్నవారు ఆహారముకై తహతహలాడినట్లు వేలకొది ప్రజలు ఈ పుస్తకములను తీసికొని చదువగోరిరి. ఈ విధముగా ప్రభువు అనేక పజల అందకార హృదయములలో తన వాక్యపు వెలుగును ప్రసంసింపజేసెను. దేవుని వాక్యముద్వారా పరిశుద్దాత్ముడు వేల ఆత్మలలో విశ్వాసమును ఎదుగ. ఏసెను. అసంఖ్యా కరమైన ప్రజలు మార్పు నొంది దేవునియందు విశ్వాసముంచిరి!
సంఘసంస్కరణోద్యమము అనేక ప్రజల హృదయమలలో ప్రారంభమాయెను. ఇది సర్వ శక్తిమంతుడగు దేవుని కార్యము. సోలిడియోగ్లోరియా. దేవునికి మహిమ!
5.లూథర్ ధైర్యం – దేవుని వాక్యానికి అంకితమైన పోరాటం
ప్రభువు పనిచేయు చోట సాతానుకూడా పనిచేయును. తత్ఫలితముగా కలుగు పోరాటము తీవ్రముగానుండును. పాపక్షమా పత్రములను అమ్ము టెట్జెల్ కొపోద్రికుడాయెను. “మూడువారములలోగా నేను ఆ దుర్బోధకుని అగ్నిమంటలలో వేయుదును” అని ఆయన పలికెను. విటెన్బర్గ్ జరిగిన దానిని రోమ్ వారు కూడా వినిరి. మొదట పోప్ పరిస్థితిని గూర్చి వినినపుడు ఆయన నవ్వెను. “సన్యాసులు వారు త్రాగినపుడు పోట్లాడుకొంటారు, పరిస్థితులు వాటంతట అవే సర్దుకుంటాయి” అని ఆమన చెప్పెను.

లూథర్నుండి పోప్ ఉత్తరము అందుకున్నపుడు అంతయూ మానిపోయెను, పరిస్థితి అంత సుళువుగా సర్దుకోదని పోప్ గ్రహించెను. పాపుల రక్షణను గూర్చిన రెఫరెన్స్లను బైబిల్ నందు చూపుతూ, టెట్జెల్ అమ్ము పాపక్షమ పత్రములను గూర్చి లూథర్ ఆయనకు వ్రాసెను. తొంబైఐదు పరిశోధనశాస్త్ర అర్థమునుకూడా వివరించెను. ఆ ఉత్తరము చాలా మర్యాద, గౌరవముతో కూడినదైయుండెను. లూథర్ ఇంకనూ పోప్ను గౌరవిస్తూ ఆయనను “పరిశుద్ధ తండ్రి” అని పలిచెను.
పోప్ కోపించెను ఆరు రోజులలోగా న్యాయస్థానము ఎదుట హాజరు కావలెనని లూథర్ ఆదేశింపబడెను. మత సంగతులను విచారించు సభ (ఇంక్విజిషన్) ఎదుట ఆయన హాజరుకావలసి వచ్చెను. లూథర్ తన రచనలన్నిటిని వెనక్కి తీసికొనవలెనని కాజిటన్ లను కార్డినల్ను పోప్ పంపెను. బైబిల్నుండి అది తప్పు అని నిరూపించినపుదే అలా చేతునని లూథర్ నిర్ణయించుకొనెను. కాజిటన్ లూథర్ను “మృగము” అని పిలిచెను, ఆమన తన రచనలను వెనక్కి తీసి కొమ్మని కోరలేదు మరియు ఆయనతో మాట్లాడుటకు నిరాకరించెను. తరువార పోప్ ఓ ప్రముఖుడైన ఉన్నత వంశీయుని (చాంబర్లిన్) విలన్బర్గ్్కు పంపెను. “చిన్ని సన్యాసిని” బహిష్కరింతునని ఆయన బయట పెట్టెను. ఈ వ్యక్తి, చక్కటి పదములలో సమస్యను పరిష్కరించే ప్రయత్నము చేసెను గాని ప్రమత్నము ఫలించలేదు.
ఇప్పుడు ప్రసిద్ధిగాంచిన పండితుడైన డాక్టర్ ఎక్క్ లూథర్ నొద్దకు వెళ్ళి మాటాడెను ఎక్స్ చాలా తెలివైనవాడైయుండి తన్నుతాను చక్కగా వ్యక్తము చేసికొనగలవాడు, అయినను ఆయన లూథర్ను ఓడింపలేకపోయెను. లూథర్ సమస్తమును బైబిల్ నుండి నిరూప్చిఎను. పోప్, నేర్పరులు మరియు గుమస్తాలు తప్పుచేయుదురని ఆయన చెప్పెను. మనకు సత్యము నేర్పునది కేవలము దేవుని వాక్యమే; అధికారముగలది కేవలము దేవుని వాక్యమే. సోల స్క్రిప్చరా కేవలము దేవుని వాక్యమే! ఎక్కక్కు చాలా కోపము వచ్చెను. ఆయన లూథర్ను అన్యుడు మరియు సుంకరియని పిలిచెను. పోప్ లూథర్ను బహిష్కరించెను. ఆయనను సంఘమునుండి తొలగించి, శాపగ్రస్తునిగా ప్రకటించిరి!
నలభైయొక్క దయ్యపుబోధల విషయమై లూథర్ను నిందిస్తూ పోప్ ఓ అధికార ప్రకటన (బుల్) జారీ చేసెను. ప్రతిచోట ప్రతియొక్కరు లూథర్ను బహిష్కరించేలా చేసెను. ఆయన ఎంతటి ప్రమాదకర దుర్బోధకుడో ప్రతియొక్కరు తెలిసికొనవలెనని కోరిరి. ఆయన గ్రంథములన్నియూ కాల్చివేయబడవలెను. ఎవరునూ ఆయనను చేర్చుకొనకూడదు. లూథర్కు ఎక్కడ కూడాను సురక్షిత స్థలము లేకుండా చేయుటకై లూథర్ను బహిష్కరిచుమని శక్తిమంతుడైన జర్మన్ చక్రవర్తి కోరబడెను. అందరు ఆయనను చంపేహక్కు కలిగియున్నారు. క్రీ.శ.1520సం॥లో సోమవారం ఉదయాన విట్టెన్బర్గ్ పట్టణమునకు వెలుపల కఱ్ఱలు పేర్చబడియుండెను. లూథర్ యొక్క విద్యార్థులు, సార్వత్రిక విద్యాలయపు ఆచార్యులు, ఇతర ప్రజలు కఱ్ఱల కుప్ప చుట్టూ సమకూడిరి.
లూథర్ తన అనుదిన ఆశ్రమ వస్త్రములను ధరించుకొని కఱ్ఱల కుప్ప చెంతకు వచ్చుచుండెను. లూథర్ రోమన్ క్యాథలిక్ కేనన్ చట్టమును ఒక చేత మరొకచేత పోప్ ఆజ్ఞను పట్టుకొనియుండెను. మంటలు ఆకాశమునకెగసెను. కీలక క్షణము వచ్చెను! లూథర్ కొన్ని అడుగులు ముందుకు వేసెను. మంట దగ్గరకు వచ్చెను. ఆయన కేనన్ చట్ట గ్రంథమును, పోప్ ఆజ్ఞా పత్రమును లూథర్ మంటలలో విసిరివేసెను. “మీరు దేవుని సత్రమును పాడు చేసిరి గనుక దేవుడు మిమ్మును మంటలలో పాడుచేయును”, అని తన వణికే స్వరముతో అరిచెను. విద్యార్థులు మరియు ఆచార్యులు “ఆమేన్” అని చెప్పిరి. దీని చేయుటద్వారా లూథర్ తాను పెరిగి ప్రేమించి ఎదిగిన తాను కాపరత్వము చేసిన సంఘమునుండి మేలుకై విడిచిపోయెను.
“నేను నిన్న చేసినది ప్రజలను నిత్యనాశనమునుండి రక్షించుటకే” అని తన విద్యార్థులతో మరుసటిరోజు చెప్పెను. దీని నిమిత్తమై “నేను జీవించినంతకాలము దేవుని వాక్య సత్యమును ప్రకటింతును” అని చెప్పెను. “దేవుని వాక్య సత్యమేమనగా ఒక వ్యక్తి క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షింపబడును. సోలాఫిడే- విశ్వాసము మాత్రమే. “నరకమా లేక హతసాక్షియగుటయా” అను ఎన్నిక మీరు చేయవలెనని తన విద్యార్థులతో చెప్పెను. మీరు రోమన్ క్యాథలిక్ మతమునందు కొనసాగితే నశించి నరకమునకు వెళ్ళుదురని లూథర్ భావము. మీరు ఆ బోధను విశ్వసింపనట్లయితే మీరు హతసాక్షిగా మరణించుటకు సిద్ధపడవలెనని చెప్పెను. లూథర్ పరిస్థిని పూర్తిగా ఎరిగియుండెను. శత్రువులు “గర్జించు సింహము” వలె దాడి చేయనైయున్నారు!.
6.రాజసభలో లూథర్ ధైర్య సాక్ష్యం
చార్లెస్ ఇరవై ఒక్క సంవత్సరములు వమసుగలవాడైనా చాలా శక్తివంతమైన పరిపాలకునిగానుండెను. ఆయన రోమా మాహానగరమునకు చక్రవర్తియైయుండి స్పెయిన్ మరియు దిగువ ప్రాంతములను ఏలుచుండెను.
ఆ ప్రాంతమునందు అలజడి చెలరేగెను. అదంతయూ మతసంబంధమైనదని చార్లెస్కు తెలుపబడెను. తన రాజ్యములో ఒకేఒక్క మతమునకు స్థానమున్నందున తప్పక ఆయన ఈ అలజడి విషయమై చర్యతీసుకొనెను. ఈ సామ్రాజ్యమునందు దుర్బోధలకు తావులేదు. ఆరొజులలో లూథర్ మరియు బైబిల్ సంబంధ బోధలు దాని ప్రచారము చేయువారు దుర్బోధకులుగా, వారి బోధలు దుర్బోధలుగా ఎంచబడెను.

లూథర్కు చాలా స్నేహితులున్నందున, వారిలో కొందరు ప్రముఖులు గనుక ఈ పరిస్థితిని అంత సులువుగా చూస్తూ ఊరుకోరు. అట్టివారితో జ్ఞానియైన ఫ్రెడ్రిక్, లూథర్ నివసించు స్థలమైన సాక్సని అను ప్రాంతమునకు ఆయన ఎలక్టర్గా నుండెను. జర్మన్ దేశములో చాలా రాష్ట్రములుండెను. ఆ ప్రతిరాష్ట్రము యువరాజులచే పాలింపబడుచుండెను. యువరాజులందరు కలసి చక్రవర్తిని ఎన్నుకొందురు, అందుకేవారిని ఎలక్టర్స్ (ఎన్నుకొనువారు) అని పిలువబడిరి. ఈ “గజ్జి గొట్టె” “దుర్బోధకుడు” చెఱలో వేయబడాలి అని డా॥ఎక్క్ చక్రవర్తిని కోరెను. లూథర్తో చర్చ జరగాలని అందులో తానునూ ఉండాలని చార్లెస్ కోరెను.
క్రీ.శ.1521లో వార్మ్స్ నందు డైయట్ జరిగెను. డైయట్ అనగా లది యువరాజులందరితో కూడిన ఓ ప్రాముఖ్య సమావేశము. రోమన్ క్యాథలిక్ మతడురువులలొనుండి ముఖ్యమైవారునూ అందులో పాల్గొందురు.
లూథర్ హాజరుకావలెనని ఆదేశింపబడెను. చక్రవర్తినుండి భద్రత సంబంధమైన హామీ లభించకపోయిననూ వెళ్ళమని ఆయన స్నేహితులు లూథర్కు సలహానిచ్చిరి. ఏదిఏమైనా వార్మ్స్ అను స్థలమునకు వెళ్ళెను. “ఇంటి కప్పుపై పెంకులు ఉన్నట్లుగా అన్నిదయ్యములున్ననూ నేను వెళ్ళుదును. ఇది దేవుని చిత్తము. నేను అక్కడికి వెళు దును” అనెను.
వేల మంది ప్రజలు ఆయనకై కేరింతలు కొడుతూ వీడ్కోలు పలికిరి. ఆయన అక్కడ చేరుకొన్నపుడు అక్కడ కూడా చాలా మంది ఆయనకు ఆహ్వానము పలికిరి. లూథర్ నగరమందు ప్రవేశించెననుటకు సూచనగా అందరు వినేలాగున మేళతాళ వాయిద్యములు మ్రోగెను. లూథర్ స్నేహితుడు జ్ఞానియైన ఫ్రెడ్రిక్ ఇట్టి మహా ఆహ్వానమును ఏర్పాటు చేసెను.
మరుసటి దినమున జనసంద్రమైన హాల్లో లూథర్ నిలువబడెను. ఆయన ఓ సాధారణ సన్యాసిగా నుంటూ దట్టమైన రంగు వస్త్రము ధరించుకొని యుండెను. ఆయన చుట్టూ రాజవైభోగము, అంతఃపుర అలంకరణ ఉండెను. చక్రవర్తి, తెల్లని ఘనమైన దుస్తులు ధరించి సిహాసనముపై కూర్చుండెను. ఆయన ప్రక్కన దేహ సంరక్షకులుడిరి. ఆయన చుట్టూ యువరాజులు, బిషప్లు, కార్డినల్స్ ఎర్రని మరియు ఉదారంగు వస్త్రములు ధరించుకొని ఆయన ప్రక్కన కూర్చుండిరి.
లూథర్ వణకుచున్నాడు. చక్రవర్తి యెదుట నుంచున్నందున లూథర్ వణకుచున్నాడా? ఆయన మరియు చక్రవర్తి దేవుని ఎదుట నుంచున్నందున భయపడితినని లూథర్ తరువాత చెప్పెను. పందొమ్మిది గ్రంథములు టేబుల్పై ఉ న్నవి. నీవు గ్రంథములు రచించావా అని చాన్స్లర్ (చక్రవర్తి సలహాదారుడు) అడిగినప్పుడు అవును అని సమాధానమిచ్చెను. ఈ గ్రంథములలో వ్రాయబడిన వన్నియూ వెనక్కి తీసికొందువా అని లూథర్ను చాన్స్లర్ అడిగెను.
ఈ ప్రశ్న దేవుని వాక్యము మరియు ఆత్మలకు సంబంధించినది మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలించుటకొరకు సమయమీయమని లూథర్ కోరగా అంతయూ నిశ్శబ్దమాయెను.
చక్రవర్తి అంగీకరించెను. మరుసటి మధ్యాహ్నము లూథర్ సభకు హాజరై జవాబీయవలెను. తన జవాబునకు ఎంతో గొప్ప పర్యవసానములుండును గనుక అది గ్రహించి లూథర్ ఎంతో తీవ్రముగా ఆ సాయంత్రము ప్రభువునకు ప్రార్థించెను. జర్మన్ ప్రజలలో చాలామంది ఆయనను బలపరచిని. ఆయన వెనక్కి తీసికోనట్లైతే మతవిషయమై గొప్ప అసమ్మతి కలిగి రెండుగుంపులు ఏర్పడును. యుద్ధము సంభవించునా? హింస చెలరేగునా? తన సామ్రాజ్యమునందు ఒకే ఒక్కమతము అనగా రోమన్ క్యాథలిక్ మతమునే చక్రవర్తి కోరుకొనెను.
నీవు ఒక్కడవే సరియైనవ్యక్తివా, రోమన్ క్యాథలిక్ మతగురువులలోని పండితులందరు వ్యర్థమా? అని సాతాను అతన చెవులలో గుసగుసలాడి లూథరను బాధించెను.
“ఓ నా దేవా నేను చాలా బలహీనుడను, నేను నీయందు నమ్మికయుంచుచున్నాను. నీ కుమారుని పేరట నాకు సహాయముచేయుము. నీవేనా నాకోట, దుర్గము, నా ఆశ్రయము….” అని లూథర్ ప్రార్థించెను. మరుసటిరోజు రాజభవనమందు లూథర్ హాజరైనపుడు దేవుడు తన హృదయమునందు సమాధానము మరియు ధైర్యముననుగ్రహించెను. “పోప్ మరియు సభలు పొరపడి తప్పిపోయిరి గనుక నేను వారిని నమ్మను కేవలము పరిశుద్ధ లేఖనముల సాక్షముద్వారా మామ్రే నామనస్సు మార్చుకొనుటకై ప్రోద్భలము చేయబడెను” అని లూథర్ తన ఉపన్యాసమునిచ్చెను
.కాని అక్కడ ఉన్నవారందరు ఇ సంగతిని చర్చించుటకు ఇష్టపడలేదు. వారికి కావలసినదంతా ఒక్కటే “నీవు నీ నమ్మకము నిజముకాదని వెనక్కి తీసికొంటావా లేదా…” “నా మనసాక్షి దేవుని వాక్యముచే చెఱపట్టబడినందున నేను వెనక్కొ తీసికోలేను. గనుక దేవా నాకు సహాయము చేయుము, ఆమేన్”! అని లూథర్ జవాబీయగా నిశబ్దము నెలకొనెను.
కోపముతో ఆయన శత్రువులు పళ్ళు కొరికిరి. వారు ఓడింపబడిరి చక్రవర్తి మరియు ఆయన పరివారము సభను విడిచి వెళ్ళగా తానున్న స్థలమునకు తిరిగి తీసికొని పోబడెను. దేవుని వాక్య శక్తిచే ఆయన జయము నొందెను.
ఇంకనూ దేవుని సత్యము నిలుచును ఎందుకంటే ఆయన రాజ్యము శాశ్వత కాలముండును!
7.లూథర్ అపహరణ – వార్ట్బర్గ్ నుండి వాక్య విప్లవం
వార్మ్స్ నగరమునుండి రెండు వాహనములు బయలుదేరుచున్నవి. ఆయన విటెన్బర్గ్్నకు తిరుగు ప్రయాణము చేయుచుండగా ఆయన సహోదరుడు మరియు ఆయనయొక్క స్నేహితులు చాలామంది ఆయనను అనుసరించిరి. ఆయన సురక్షిత ప్రయాణము కలిగియుండులాగున ఇరవై గుఱ్ఱపు రౌతులు లూథర్ వాహనములకు సమీపముగా వెళ్ళు లాగున చక్రవర్తి ఆజ్ఞాపించెను. రెండవ దినమున లూథర్ సైనికులను వెనక్కి పంపెను. వారు లేకయే ప్రయాణము కొనసాగించుటకు లూథర్ సంతసించెను. తరువాత అదే రోజున లూథర: వాహనము ప్రక్కదారిలో తిరిగి పడెను. సమీప గ్రామములోనున్న తన బంధువులను ఆయన దర్శింపగోరెను. మధ్యాహ్న సమయములో వారు గ్రామమునుండి తిరిగి మరియొకసారి బయలుదేరిరి, కాని ఇప్పుడు వారు సుదీర్ఘ, ఒంటరి, చీకటి అడవి గుండా ప్రయాణింపవలెను. అకస్మాతుగా రోడ్డు ప్రక్కన పొదలలోనుండి ఓ పెద్ద శబ్దము కొమ్మల చప్పుడు వినపడెను. ఆయుధములు గల ఐదుగురు లూథర్ వాహనములోనికి దూకి ఆయనను బయటకు లాగిరి! ఆయన అనుచరులు పారి పోయిరి. లూథర్ను దాడి చేసినవారు మరింత దట్టమైన అడవిలోనికి లాక్కొని వారి గుఱ్ఱములునుంచున్న స్థలము దగ్గరికి తీసికొని పోయిరి. లూథర్ను గుఱ్ఱముపై ఉంచి ముందుకు కొనసాగించిరి. గంటల తరబడి వారు ముందుకు ప్రయాణించిరి.

తుదకు వారి వాహనము ఓ ఎత్తైన దట్టమైన కొండను చేరుకొనెను. కొండమీద వార్ట్బర్ అనే ఓ కోట ఉండెను. చేరుకున్న వెంటనే లూథర్ ఓ బలమైన ద్వారముగుండా అదృశ్యమాయెను. తన స్నేహితులచే ఆయన బందీగా కొనిపోబడెను.
కోట లూథర్ సంరక్షకుడైన ఎలక్టర్ అయిన ఫ్రెడ్రిక్్నకు చెందును. లూథర్ ప్రాణమునకు ముప్పున్నదని ఫ్రెడ్రిక్ గ్రహించెను గనుక “అపహరణ” (కిడ్నాప్) ఆయనే జరిగేలా చేసెను. అతిత్వరలో చక్రవర్తిచే లూథర్ బహిష్కరింపబడునని ఆయన ఎరిగియుండెను. ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు గనుక లూథర్ వార్ట్బర్గ్ క్షేమముగా నుండెను.
ప్రభువు తన సేవకుని అలా చూచుకొనును. “మన దేవుడింకనూ సురక్షిత బలమైనకోటగానుండును.”
“ఆయన నమ్మదగిన డాలు మరియు ఆయుధము”! (లూథర్ వ్యవహారభాషలో వ్రాసిన 46వ కీర్తననుండి.)
లూథర్ అపహరింపబడిన వార్త జర్మన్ దేశమంతయూ అగ్నివలె త్వరగా వ్యాపించెను. అపహరించిన వారేమి చేతురోయని తన స్నేహితులు దుఖపడిరి. కాని ఆయన శత్రువులైతే….. దుర్బోధ తుడిచివేయబడిదని. సంబరపడిరి. ఇప్పుడు లూథర్ జీవిత విధానము మారెను. ఆయన గడ్డమున్న ఉన్నత వంశీయునివలె రాజ కుమారుని వస్త్రములు ధరించి మారు వేశమున వెళ్ళెను. వారు ఆయనను “జంకర్ జార్జ్” అని పిలిచిరి. ఇలా చేయుటలో లూథర్ ఏదో ఒక పని కలిగియుండెను. త్వరలోనే ఆయన ప్రసంగములను ఉత్తరములను వ్రాయనారంబించెను. అవి విట్టెన్బర్గ్ తన స్నేహితులకు చుట్టు ప్రక్కన సరఫరా చేయబడెను. లూథర్ గ్రంథములను ఇంటి యొద్దకాకుండా చదువుట నిషేధింపబడెను గనుక వారు చాలా జాగ్రత్తగా ఉండవలెను.
వార్ట్బర్గ్ లో లూథర్ ఓ ముఖ్యమైన, దీవెనకరమైన, పెద్ద పనిని ప్రారంభించెను. ఆ పనియేదనగా క్రొత్త నిబంధన గ్రంథమును గ్రీక్ నుండి జర్మన్లోనికి అనువదించుట. పదకొండు వారముల పాటు ప్రతి రోజు ప్రొద్దుట ప్రారంభించి మధ్యరాత్రివరకు పని చేసేవాడు. జ్ఞానము మరియు ఖచ్చితమైన తలంపులను ఆ పనికి తగినట్లుగా ప్రభువే ఇచ్చెనని ఆయన చెప్పెను. ముప్పునకు గురైన దేవుని దివ్య వాక్యమును కడు జాగ్రత్తతో అనువదించుపనిఅది. పది నెలల పిమ్మట లూథర్ మరొక్కసారి అకస్మాతుగా విటెన్బర్గ్్కు తిరిగి వచ్చెను. అక్కడ ప్రజల మధ్యన అల్లరి చెలరేగెను. బలవంతముగా రోమన్ క్యాథలిక్ సంఘము యొక్క దురభ్యాసములు పూర్తిగా రూపుమాపు చేయవలెనని వారు భావించిరి. అందుకే సంఘములలో విగ్రహములు వేదికలు నాశనము చేయుటకై మతగురువులు పంపబడిరి.
గందరగోళము ఏలుబడి చేసెను! సంఘ సంస్కరణ గొప్ప ప్రమాదము నందుండెను.
లూథర్ ఈ సంఘటనలను గూర్చి విని గ్రహించి ఇప్పుడు తిరిగి విటన్బర్గ్ చేరుకొనెను. ఆయనకు మరియు తన అనుచరులకు మరణశిక్ష విధింపబడెను గనుక అక్కడికి తిరిగి వచ్చుట ఆయనకు ఎంతో ప్రమాదకరము. అయిననూ తిరిగి వచ్చెను! ఒక క్షణముకూడా వెనుకాడకండా ఆనగరమునందలి సంఘమునకు ప్రతి ఉదయము వెళ్ళి ప్రజలకు బోధించుచుండెను. ప్రశాంతముగా ఉండుమని ఆయన వారిని హెచ్చరించెను. నగరములో మరొక్కసారి యథాతథ వాతావరణము నెలకొనెను.
క్రీ.శ. 1522లో లూథర్ అనువదించిన క్రొత్త నిబంధన ఐదువేల ప్రతులు ముద్రింపబడెను. తక్కువ దినములలో అవన్నియూ అమ్మబడెను! ముద్రికులు చాలా కష్టపడవలసి వచ్చెను. ప్రజలు అనుదిన భాషలో అనువధింపబడిన బైబిళ్ళు వేలకొలదిగా పట్టణములు మరియు గ్రామములను చేరుకొనెను. చీకటిలో జ్యోతి వలె దేవుని వాక్యము అంతటయూ ప్రసరించెను. ఆ జ్యోతిని మోయు వానిగా దేవుడు లూథర్ను నియమించెను. లూథర్ మరియు తన స్నేహితుల సహాయముచే పాతనిబంధన అనువాదమును ప్రారంభించెను. పాతనిబంధనను ఉత్పత్తి చేయుటకు అది సంవత్సరములు పట్టెను. క్రొత్తనిబంధనతో పోలిస్తే పాత నిబంధనను అనువదించుట చాలా కష్టము. క్రీ.శ. 1534లో అది పూర్తిగాచేయబడెను.
బోధకులు అంతట వెళ్ళిరి మరియు వారెక్కడికి వెళ్ళినా వారి సందేశమును ఆలకించుటకెగుమికూడేవారు. వారు దేవుని వాక్యము కొరకై ఆకలి గొనిరి గనుక దానిని వినుటకై ఆరాట పడిరి. కృప ద్వారా ప్రభువైన యేసు నందలి విశ్వాసము ద్వారా మాత్రమే వారు ఎలా రక్షింపబడుదురో దేవుని వాక్యము తెలుపును. ఈ విధముగా ప్రభువు తన వాక్యము ద్వారా వేల హృదయములలో పనిచేసెను. రోమన్ క్యాథలిక్ మతపు అబద్ధముల ద్వారాగాక తన దివ్య వాక్యముద్వారా ఆయన ప్రజలను పరిమార్చును. ఇది హృదయ నిజ మార్పు, పరివర్తనము!
8.సంస్కరణ కొనసాగెను కాని ప్రమాదములు చెలరేగెను
లూథర్ తన సంస్కరణ కార్యమును కొనసాగించెను. పరిచర్య నిమిత్తమై ఆయన అనేక విద్యార్థులకు తర్ఫీదునిచ్చెను. సంఘ కార్యక్రమములను కూడా సంస్కరింపవలసివచ్చెను. ఇప్పుడు ప్రజల దైనందిన భాషలో దేవుని వాక్యమును బోధించుట సంఘ కార్యక్రమములో అతి ప్రాముఖ్య భాగమాయెను. ఇక నెన్నటిని బలిపూజ ఉత్సవము జరుగదు. (బలిపూజోత్సవము జరుపబడిసప్పుడెల్లా (మాస్) ప్రభువైన యేసు బలియర్పణ పునరావృతము చేయబడునని రోమన్ క్యాథలిక్ సంఘము బోధించెను.) ప్రభురాత్రి విందు లేదా పవిత్ర సంస్కారము బలిపూజ స్థానమునందు వచ్చెను. ప్రభురాత్రి భోజన సంస్కారములన్నింటిలో రొట్టె తినుట మాత్రమే గాక ప్రతియొక్కరు ద్రాక్షారసమును పుచ్చుకొందురు. రోమన్ క్యాథలిక్ సంఘములో నైతే మతగురువు మాత్రమే ద్రాక్షారసము త్రాగుటకు అనుమతింపబడెను ఎందుకంటే వారి బోధ ప్రకారము ద్రాక్షారసము ప్రభువైన యేసు రక్తము వలె మారును. దానిని ఒక్క చుక్కకూడా ఒలికింపకూడదు.

సంఘము పాడవలెనని లూథర్ కోరెను. స్వయాన ఆయనే కీర్తనలు వ్రాసేవాడు. ఉదాహరణకు “మా కర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు” అనువాద కీర్తన ఆంధ్రక్రైస్తవ కీర్తన 37. లూథర్ ఎంతో చక్కటి అభిరుచిగలవాడు గనుక ఆయనే తన కీర్తనలకు సంగీతము కూర్చెడివాడు. సంఘములు, పాఠశాలలు, ఇండ్లు మరియు పని స్థలములలోనూ ఆ కీర్తనలు వినబడును. సంత వీధులలో లూథర్ కీర్తనలను ప్రజలు విందురు!
జర్మన్ మహా సామ్రాజ్యములో క్రీ.శ.1530లో రాజకీయ ప్రతినిధి సభజరుపబడెను. సంస్కరణను బలపరచిన రాకుమారులునూ హాజరైరి, లూథర్ అనుచరులు హింసింపబడుటను వారు నిరసించిరి (ప్రొటెస్ట్) చేసిరి. ఈ కారణముచే సంస్కరణను బలపరచు వారందరు ప్రొటెస్టెంట్స్ అని మారుపేరుతో పిలువబడిరి. మెలాంక్షన్ రూపొందించిన లూథరన్ విశ్వాసపు ఒప్పుకోలు ప్రతిని రాకుమారులు చక్రవర్తికిచ్చిరి. (పండితుడైన ఆచార్య మెలాంక్షన్ లూథర్కు విశ్వసనీయమైన మంచి మిత్రుడు.) కాని చక్రవర్తి ఏ మాత్రమును ఆసక్తి చూపలేదు. ఆగ్స్బర్గ్ లో జరిగిన సమాలోచన సభలో మెలాంక్తన్ ప్రొటెస్టెంట్లను సమర్థించినపుడు ఆయన వినుటకు నిరాకరించెను. తన సామ్రాజ్యమందు కేవలము రోమన్ క్యాథలిక్ మతము ఉండాలని చక్రవర్తి కోరెను!
అతి త్వరలోనే ఇతర స్థలముల ద్వారా సంస్కరణ కార్యము గొప్ప ప్రమాదమును ఎదుర్కొనెను. క్రీ.శ.1525లో గ్రామ ప్రజలు గొప్ప తిరుగు బాటు చేసిరి. చాలా కాలము పాటు ఉన్న వంశీయులు బడుగు జనమును బానిసవలె ఎంచిరి. సాధారణ జనానీకము కఠిన దారిద్య్రమందుండిరి. మొదట లూథర్ బడుగు ప్రజలను బలపరచెను. రాకుమారులు మరియు ఉన్నత వర్గీయులు బడుగు జనమును మానవతా దృక్పథము చూడవలెనని లూథర్ కోరెను. థామస్ మూంట్జెర్ నాయకత్వములో సాధారణ జనానీకము ఆయుధములు పట్టినప్పుడు లూథర్ తన మద్దతిని వెనక్కి తీసికొనెను. ఎందుకంటే వారు తమ విడుదలనిమిత్తమై హత్య, దోపిడి మరియు దహన కాండలను వాడిరి. (ఈ ఉద్యమము పెజంట్ల రివోల్ట్, రైతుల తిరుగుబాటు అని పేరొందెను). బడుగు జనము పోరాడి పొందాలనుకునే విడుదలవేరు సంస్కరణ కర్తలు పలికిన వేరు. ఆయన వాక్యాను గుణముగా దేవుని ఆరాధించు స్వేచ్ఛను సంస్కరణను కోరిరి. ఇప్పుడు ప్రమాదమేమిటంటే సంస్కరణను బడుగుజన తిరుగుబాటువలె భావిస్తున్నారు. బడుగుజన తిరుగుబాటును బల ప్రయోగము ద్వారా అణచివేయాలని లూథర్ రాకుమారులను కోరెను. తదుపరి జరిగిన ఘోర వధలో వేలకొలది బడుగువర్గము వారు కూలిరి.
ఇక్కడ మరొక ప్రమాదము కూడ కలదు. మత తీవ్ర వాదులని పిలువబడే ప్రొటెస్టెంట్లు ఉన్నారు. వారు నేరుగా పరిశుద్ధాత్ముని ప్రేరణ ప్రకారము జీవింతురు. తత్ఫలితముగా వాని జీవితములలో పరిశుద్ధలేఖనములు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగియుండక వారి అంత: భావోద్రేకములు “అంతరంగ వెలుగు అధిక ప్రాధాన్యత కలిగియుండును. లోకముచే కల్మషము కాని పరిశుద్ధుల నిజ సహవాసమును ఈ ప్రజలు ఏర్పరచ ప్రయత్నించిరి.
అది మాత్రమేగాక వారిలో చాలామంది శిశు బాప్తిస్మము తిరస్కరింతురు. ఎవరైతే తమ మార్పును గూర్చి మాట్లాడగలరో వారికి మాత్రమే బాప్తిస్మము అనుమతింపబడును; గనుక శిశువులు మినహాయింపబడిరి! గనుక వీరు అనా బాప్టిస్టులని పిలువబడిరి. (అనాబాప్టిస్ట్ ఉద్యమములో సంపూర్ణ సభ్యులు కావలెనంటే, శిశు వులుగానుండి బాప్తిస్యము తీసుకొనువారు తిరిగి బాప్తిస్మము తీసుకోవాలి.) జర్మనీలో బడుగు జన తిరుగు బాటు తరువాత (ప్రెజంట్ రివోల్ట్) అనా బాప్టిస్ట్ సహవాసములేర్పడెను. త్వరలోనే వారు స్విట్జర్లాండ్ మరియు దిగువ దేశాలలో సహితము వ్యాపించిరి. ప్రొలెస్టెంట్లలో యథార్థమైన భక్తిపరులైన ప్రజలున్నారు, వారిలో ప్రమాదకరమైన మత తీవ్రవాదులు కూడ ఉన్నారు. ఈ ప్రజలు ఆయుధములు ధరించి ప్రభుత్వాధికారమును ధిక్కరించిరి! మున్స్టర్ నగరంలో డచ్ అనాబాప్టిస్ట్ గుంపువారు ఈ భూమిమీద దేవుని రాజ్యమును స్థాపింప ప్రయత్నించిరి. లేడన్ యొక్క వ్యక్తి “కింగ్ ఆఫ్ సియాన్” సియోను రాజుగా ప్రకటింపబడెను. మరియు లూథరన్లు మరియు రోమన్ క్యాథలిక్లు నగరమునుండి బహిష్కరింపబడిరి!
పరిశుద్ధముగా మారుటకు బదులుగా మున్జర్లో జీవితము నానాటికి అధిక పాపాత్మకమాయెను త్వరలోనే మున్స్టర్ మరియు పరిసర ప్రాంతములలో నివసించు రాకుమారులు నగరమును స్వాధీనపరచుకొని మత తీవ్రవాదమును అంతమునొందించిరి.
అనాబాప్టిస్ట్లు సంస్కరణకు ఎందుకు బెదిరింపుగానుండిరి? సంస్కరణ ఉ ద్యమ వాదులందరు మునస్టర్ లోని అల్లరి మరియు తిరుగు బాటు దారులైన అనాబాప్టిస్ట్ల లాంటి వారేనని చాలామంది భావించిరి.
అదృష్టవశాత్తు ఇతర రకములైన బాప్టిస్ట్ వారు కూడా ఉన్నారు, వారు మెనొనైట్లుగా పిలువబడిరి. దాని వ్యవస్థాకునిపేరు మెన్నొసైమన్స్. వారునూ శిశు బాప్తిస్మము తిరస్కరింతురు. ఒట్టుపెట్టుకొనరు, సైన్యములో చేరరు. కాని మున్స్టర్లో జరిగే తిరుగుబాటును వారు నిశ్చితముగా తిరస్కరించిరి.
9.లూథర్-అంతం వరకు కష్టపడి పని చేసెను
క్రీ.శ. 1530–1545 సం॥లలో కొనసాగివృద్ధినొందెను, ప్రత్యేకముగా జర్మనిలో లూథర్ కష్టించి పని చేసెను. విశ్వసనీయులైన స్నేహితులు మరియు సహాయకులచే బలపరచబడెను.
పరిచారకులుగా కాబోయే విద్యార్థులకు ఎంతో బోధన మరియు శిక్షణనివ్వవలసి వచ్చెను. కాని శిక్షణ కావలసినది విద్యార్థులకే కాదు గాని సాధారణ ప్రజలకునూ అవసరమాయెను ఎందుకంటే బైబిల్ నిజ సందేశము విషయములో వారు ఎంతో అజ్ఞానులుగానుండిరి. ఏది ఏమైనా లూథర్ ఒక్క విషయములో తప్పుచేసెను. అది చాలా విచారకరము. ప్రభురాత్రి భోజనము ప్రభువైన యేసు రక్తము మరియు శరీరమువలె మారును, ఇది రోమన్ క్యాథలిక్ సంఘ బోధ (దీనిని ట్రాన్సబ్ స్టాన్సియేషన్ సిద్ధాంతము అని అందురు . దీనిని మనము 29వ అధ్యాయములో చదివెదము) కాని క్రీస్తు తన శరీర స్వభావము చొప్పున అంతటయుండును, గనుక ద్రాక్షారసము మరియు రొట్టెలోనూ క్రీస్తు సాక్ష్యాత్కరించును అని లూథర్ విశ్వసించెను. “నాకొరకైన అనుగ్రహింనబడిన మరియు క్రుమ్మరింపబడిన క్రీస్తు శరీరము మరియు రక్తము, ప్రభురాత్రి విందు సమయములో నాకై అనుగ్రహింపబడి క్రుమ్మరింపబడును”. మనము దీనిని కాన్ సబ్స్టేన్సియేషన్ సిద్ధాంతమని అందుము. ఈ సిద్ధాంతము సంస్కర్తలలో అసమ్మతి మరియు అనైక్యతకు దారి తీసెను. ఇది చాలా విచారకరము. ఈ అంశమును గూర్చి రాబోవు అధ్యాయములలో మనము ఎక్కువగా చదువుకొందుము.
క్రీ.శ. 1525 సం||లో, లూథర్ వివాహమాడెను. మత గురువులు బ్రహ్మచర్యము పాటించాలి అని నొక్కిచెప్పు రోమన్ క్యాథలిక్ సంఘ నియమములకు విరుద్ధముగా చాలా దూరముగా లూథర్ వుళ్ళెను గనుక ఆయన తిరిగి రాని రాజీపడని స్థితికి చేరుకొనెను. ఆయన స్నేహితులు మరియు శత్రువులు తన అంతరమునెరుగుదురు.
లూథర్ క్యాథరిన్ వాన్ బోరను వివాహమాడెను. క్యాథరిన్ పదవయేట మత కన్య మఠంలో చేర్చబడెను. అక్కడ తను తన జీవితాంతము ఉండవలసియుండెను. ఆశ్రమములోనుండగా మఠ కన్యకలు లూథర్ గూర్చి వినిరి.
వారు ఆయన కరపత్రికలను కొన్నిటిని చదివిరి. రోమన్ క్యాథలిక్ సంఘము మరియు మఠ జీవితములోని తప్పిదములను ఈ పత్రికలద్వారా వారు గ్రహించులాగున ప్రభువు వారి నేత్రములు తెరిచెను.
తతతముగా క్రీ.శ.1523సం॥లో మరో పదకొండుగురు మఠకన్యకలతో సహా ఆశ్రమమునుండి పారిపోయిరి. వారందరు కలసి విట్టెన్ బర్గ్కు వచ్చిరి. లూథర్ క్యాథరిన్ను గూర్చి తెలుసుకొని క్రీ.శ.1525సం||లో ఇరువురు వివాహమాడిరి.
తను వివాహమాడినందు రోమన్ క్యాథలిక్ స్థావరములు అనేక ఎగతాళి మరియు దుర్భాషలు లూథర్పై రువ్విరి. “వారికి పిల్లలే పుట్టినట్లైతే, వారు దయ్యపు పిల్లలైయుందురు…..!” అని ఆయన శత్రువులు పరిహాసం చేసిరి.
లూథర్, క్యాథరిన్ దంపతులు 25 యేండ్లకు పైబడి వివాహ జీవితమును అనుభవించిరి. లూథర్ తన అనేక క్లిష్టమైన కాలములలో “క్యాథి” నుండి ఎంతో ఆదరణ పొందెను.
లూథర్, క్యాథరిన్లకు ఆరుగురు సంతానముండెను. 13 సం||ల యౌవన బాలిక వారి కూతురు చనిపోయినప్పుడు వారు చాలా బాధపడిరి. కాని వారి కూతురు తనతో పరలోకమందున్నదని దేవుడు వారిని ఓదార్చెను.
క్యాథరిన్ అవిరామ జీవితము జీవించెను. తన సొంత పిల్లలను చక్కగా చూచుకొనుట మాత్రమే గాక వారితో పాటు వారి గృహములో నివసించు విద్యార్థులను, అనాథలను చక్కగా చూచుకొనెను. లూథర్ యొక్క బంధువులునూ వారితో ఉండేవారు. ఆశ్రమమును విడిచివచ్చిన సన్యాసులు తరచుగా వారి ఇంటిలో ఆశ్రయము తీసుకొనేవారు. వ్యాధిగ్రస్తులను క్యాథరిన్ శ్రద్ధతో చూచుకొనెను. ఇవియేగాక, బ్రెడ్ తయారి, కోళ్ళ పెంపకం, కూరగాయలు పండించటం మున్నగునవి చేస్తుండెను! లూథర్ ఉదార స్వభావము గలవాడు గనుక తరచుగా డబ్బు విషయమై తను ఇబ్బంది పడసాగెను. రాత్రులు సహితము మెలకువతో ఉంటుండెను.
లూథర్ ఓ ప్రయాణము నిమిత్తమై సిద్ధపడుచున్నాడు. ఆయన అనేక స్థలములకు వెళ్ళ బోధించువాడు గనుక ఆయనకు ప్రయాణం కొత్తేమికాదు. కాని ఇప్పుడాయన కాస్త భిన్నముగా చేయబోతున్నాడు. పోట్లాడుచున్న ఇరువురు మండలము/జిల్లాలతో ఆయన మాట్లాడబోతున్నాడు. ఆయన వెళ్ళటం చూస్తూ క్యాథరిన్ దిగులుపడెను. ఆయన చాలా కష్టించి పని చేయుచున్నాడు గనుక గత కొన్ని వారములనుబట్టి ఆయన అంత ఆరోగ్యముగా కనిపించుటలేదు.
నాలుగు దినముల ప్రయాణము పిదప లూథర్ ఏసల్బెన్ చేరుకొనెను ఇరువర్గములను సమాధానపరచెను. అక్కడ కూడా ఆయన నాలుగు మార్లు బోధించెను, కాని ఆయన చివరి ప్రసంగము అసాధారణముగానుండెను. ఆయనకు బాగలేనందున పడుకొనెను. శ్వాస తీసికొనుటకు చాలా కష్టమాయెను. ఆయనను చూచుటకు వైద్యులు వచ్చిరి గాని వారేమియూ చేయలేకపోయిరి. తదుపరి మధ్య రాత్రి తను మరణిస్తాడని స్పష్టమాయెను. “మా ప్రభువైన యేసు క్రీస్తు తండ్రివైన దేవా నీకు కృతజ్ఞతలు. నీవు నాకు నీ ప్రశస్త కుమారుని ప్రత్యక్షపరిచావు. నేను ఆయనను నమ్మితిని, నేనాయనను ప్రేమించితిని నా బోధనాంశము ఆయనే” అని ఆయన చెప్పుట ఆయన మిత్రులు వినిరి. “తండ్రీ నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను” అని మూడు సార్లు ప్రార్థించటం వారు వినిరి. తుదిశ్వాస విడిచి ఆయన వెడలిపోయెను.
తన రాజు నిమిత్తమై కృపద్వారా సుసాధ్యము చేయబడిన మంచి విశ్వాస పోరాటము పోరాడి లూథర్ తన జీవితమును ముగించెను. “లూథర్ అసామాన్య దేవుని దాసుడు, విశిష్టమైనవాడు” అని కాల్విన్ చెప్పెను. ఆయన శరీరము విట్టెన్బర్గ్్కు తీసికొని పోబడెను. మరణ గంటలు మ్రోగెను ఊరేగింపు గ్రామములు, పట్టణములు మరియు నగరములగుండా వెళ్ళెను. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చివరిసారిగా గంటలు మ్రోగెను.
క్యాజ్ చర్చ్లో ప్రసంగవేదిక ప్రక్కన లూథర్ పూడ్చిపెట్టబడెను, అక్కడే ఆయన తరచుగా నిలువబడి సువార్త బోధించుచుండెడివాడు. సర్వశక్తిగల దేవునియెదుట అత్యల్పుడనని బావించిన ఈ గొప్ప సంస్కరణకర్త………….. పరలోకగృహము చేరెను! తుదకు తన పరలోకగృహము చేరెను!
Youtube Video

More Stories
William Tyndale Biography | Apostle of England | Missionary Stories Telugu | 15 century

Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography
Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu Martin Luther Biography Telugu